వేరువేరు సంఘటనలో ఇద్దరు మృతి..

by Disha Web Desk 20 |
వేరువేరు సంఘటనలో ఇద్దరు మృతి..
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలో బుధవారం వేరువేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఉరి వేసుకుని ఒకరు, ప్రమాదవశాత్తు చెరువులో పడి మరొకరు మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఇరువురు కూడా కొంతకాలంగా కనిపించడం లేదని వారి కుటుంబసభ్యులు వేరువేరుగా ఫిర్యాదులు చేశారన్నారు. జుండా గ్రామానికి చెందిన తులసి రామ్ (60) ఫిబ్రవరి 22వ తేదీన ఈ గ్రామంలో బంధువుల పెళ్లి కని వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం నుండి కనిపించలేదు.

మృతుని పెద్దకొడుకు కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. మానస్థాపం చెంది జీవితం పై విరక్తి చెంది చొండి గ్రామంలోని చెట్టుకు ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నారు. పాన్గ్రా గ్రామానికి చెందిన దిలీప్ (24) ఫిబ్రవరి 8వ తేదీన వాలేగం గ్రామంలోని టెంపుల్ దర్శనానికి వెళ్ళాడు. ఊరికెళ్లి తిరిగి వచ్చి బహిర్బోమి కానీ బయటికి వెళ్లి తిరిగి రాలేదు. పాంగ్ర గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులకు శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా కనిపించకపోయిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ మృత్యువాత పడ్డ విషాదకర సంఘటనతో బయటకు వచ్చింది. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ పేర్కొన్నారు.

Next Story