చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

by Disha Web Desk 1 |
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి
X

చేగుంట మండల కేంద్రంలోని మామిడి కుంట వద్ద ఘటన

దిశ చేగుంట : చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు కుంటలో పడి మృతిచెందిన ఘటన చేగుంట మండల కేంద్రంలోని మామిడికుంట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని వడియారం గ్రామానికి చెందిన గేట్ మల్లేశం (35), బొక్క యాదగిరి (28) మంచి స్నేహితులు. ఆదివారం ఇద్దరు కలిసి మండల కేంద్రంలోని శ్మశాన వాటిక వద్ద ఉన్న మామిడి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు.

అంతకు ముందు కుంటలో నీళ్లు నిలిచేందుకు జేసీబీలతో పెద్ద పెద్ద గుంతలు తీయించారు. అది గమనించని మల్లేషం, యాదగిరి కుంటలోకి దిగి గల్లంతయ్యారు. నిన్నటి నుంచి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోను రింగ్ అవుతున్నప్పటికీ ఎంతకు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి మామిడికుంట వద్ద పరిశీలించారు. తీర అక్కడ చూస్తే.. ఒడ్డుపై ఇద్దరు బట్టలు, వలలు, గడియారం కనిపించాయి. చివరికి శ్రమించి కుంటలో ఉన్న మృతదేహాలను వెలికి తీయించారు.

విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుటుంబాన్ని పోషించే ఇద్దరి యువకులు చేపలు పట్టడానికి వెళ్లి విగత జీవులుగా తిరిగి రావడంతో బాధిత కుటుంబాల రోదనతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.



Next Story

Most Viewed