గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి..

by Disha Web Desk 20 |
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి..
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి పెద్ద అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో చోటు చేసుకుంది. విరాల్లోకివెళితే ఫిగ్లీపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ వాహబ్ తన ఇద్దరు చిన్నారులు నోరిన్ (13), బిస్మరిజ (12)లతో కలిసి గురువారం రాత్రి TS-07-JA-7203 నంబర్ గల ఎలక్ట్రికల్ స్కూటీ పై సికింద్రాబాద్ కు వెళ్లి తిరుగుపయనం అయ్యారు.

సరిగ్గా అబ్దుల్లాపూర్మెట్ శివారులోని తందూరి వాల హోటల్ ఎదురుగా రాగానే గుర్తుతెలియని వాహనం స్కూటీ వెనక నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నోరిన్ అక్కడికక్కడే మృతిచెందగా, బిస్మరిజ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో తండ్రి వాహబ్ తీవ్రంగా గాయపడి హయత్నగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story