రెండు బైక్ లు ఢీ.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 1 |
రెండు బైక్ లు ఢీ.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
X

దిశ, మెట్ పల్లి : ప్రమాదవశాత్తు రెండు బైక్ లు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయలై పరిస్థితి విషమంగా ఉన్న ఘటన మండల పరిధిలోని వెల్లుల్ల ఎల్లమ్మ దేవస్థానం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రతి మంగళవారం మెట్ పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ దేవస్థానం వద్ద భక్తులు తాకడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అమ్మవారిరి మొక్కు తీర్చుకుని తిరుగు ప్రయాణంలో అరపెటా గ్రామానికి చెందిన రాజేందర్, వెల్లుల్లా గ్రామానికి చెందిన మహేష్ లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేందర్ కు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి ఇరువురి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కొరకు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed