తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకుల పేర్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

by Disha Web Desk 2 |
తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకుల పేర్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృష్ణయ్యను హత్య చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన ముత్తేశం అనే వ్యక్తి దుండగుల పేర్లు బయటపెట్టడం మరో సంచలనానికి దారితీసింది. ముత్తేశం వివరాల ప్రకారం.. ''కృష్ణయ్యను చంపేందుకు ఆటోలో ఆరుగురు వచ్చారు. గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బోడభట్ల శ్రీను, నాగేశ్వరరావులు కత్తులు, వేట కొడవళ్లతో వచ్చి కృష్ణయ్యను కిరాతకంగా నరికి చంపారు. తనను గమనించి దాడి చేసేందుకు తనపైకి వస్తుండగా రాళ్లతో కొట్టాను. అనంతరం పెద్దగా కేకలు వేయడంతో నలుగురూ ఆటోలో పారిపోయారు.'' అంటూ ప్రత్యక్ష సాక్షి ముత్తేశం వివరాలు వెల్లడించారు. కాగా, హత్య సమయంలో తమ్మినేని కృష్ణయ్యతో పాటు తాను కూడా బైకుపై వెనుక ఉన్నట్లు ముత్తేశం చెప్పారు.

బిగ్ బ్రేకింగ్.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం


Next Story