TSPSC పేపర్ లీక్ కేసు: అఫిడవిట్​ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ బోర్డు

by Dishafeatures2 |
TSPSC పేపర్ లీక్ కేసు: అఫిడవిట్​ దాఖలు చేసిన టీఎస్పీఎస్సీ బోర్డు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కాంగ్రెస్​దాఖలు చేసిన పిటీషన్​పై బోర్డు అదనపు కార్యదర్శి, నోడల్​ ఆఫీసర్ (లీగల్) ఆర్.సుమతి హైకోర్టులో అఫిడవిట్ ​దాఖలు చేశారు. బోర్డు పరీక్షలకు సంబంధించిన పరీక్షల ప్రశ్నాపత్రాలను కాన్ఫిడెన్షియల్ ​సెక్షన్​ నుంచి ప్రశాంత్, రాజశేఖర్​రెడ్డి కలిసి తస్కరించినట్టు ఇప్పటికే సిట్​విచారణలో వెల్లడైందని అందులో పేర్కొన్నారు. సిట్​ అధికారులు ఈ కేసుకు సంబంధించి కొందరు బోర్డు ఉద్యోగులతో పాటు మరికొందరు ప్రైవేట్​ వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

ప్రశ్నాపత్రాలు లీక్​ అయ్యాయని తెలిసిన వెంటనే పలు పరీక్షలను రద్దు చేసినట్టు తెలియచేశారు. మొదట బేగంబజార్​ పోలీసులు కేసు నమెదు చేసి నిందితులను అరెస్టు చేశారని, ఆ తరువాత కేసును సిట్​కు బదిలీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు సంతృప్తికరంగా కొనసాగుతున్నందున సీబీఐకి అప్పగించాలంటూ కాంగ్రెస్​పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటీషన్​ను డిస్మిస్​ చేయాలని అఫిడవిట్​లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ సోమవారం జరుగనుంది.

Next Story