- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Trending: బుల్లెట్ బండి నడిపాడని.. దళిత యువకుడిపై కత్తులతో దాడి

దిశ, వెబ్డెస్క్: దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తున్నా.. నేటికీ గ్రామాల్లో కులాల మధ్య కుంపటి చల్లారడం లేదు. నిరుపేదలపై అగ్రవర్ణాల అధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని శివగంగా (Siva Ganga) జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మేల్పిడవూరు (Melpidavoor) గ్రామానికి చెందిన అయ్యాసామి (Ayya Swamy) శివగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, చదువును కొనసాగిస్తూరనే పార్ట్ టైం బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ.. అతడు తనకు ఇష్టమైన బుల్లెట్ బైక్ (Bullet Bike) కొనుక్కొని దానిపైనే నిత్యం కాలేజీకి వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే గ్రామంలోని అగ్రవర్ణాలను చెందినకొంత మంది యువకులు, అయ్యాసామిపై కక్షగట్టారు. తమ ముందే బుల్లెట్ బండి నడుపుతా.. అని కోపంతో రగిలిపోయారు. అయితే, బుధవారం అయ్యా సామి రోజు మాదిరిగానే కళాశాలకు తన బుల్లెట్ బండిపై వెళ్తుండగా అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు. ‘కులం తక్కువోడివి మా ముందు బుల్లెట్ బండి నడుపుతావా.. నీకు బుల్లెట్ బండి కావాల్సి వచ్చిందా అంటూ కత్తులతో ఆ యువకుడి రెండు చేతులపై మూకుమ్మడిగా దాడి పాల్పడ్డారు. రక్తపు మడుగులో ఉన్న అయ్యాసామిని చూసిన స్థానికులు చికిత్స నిమిత్తం మధురై రాజాజీ (Madurai Rajaji) ఆసుపత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగానే అయ్యా సామి కుటుంబం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆ ముగ్గురు అగ్రవర్ణ యువకులు బాధితుడి ఇంటికి వెళ్లి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయ్యా స్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు (SC ST Atrocity Case) నమోదు చేసి అరెస్ట్ చేశారు.