రోడ్డు దాటుతుండగా విషాదం.. స్కూటీ ఢీకొట్టి కిందపడిన వ్యక్తిపై కారు దూసుకెళ్లి మృతి

by Taduka Kalyani |

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు దాటుతుండగా విషాదం.. స్కూటీ ఢీకొట్టి కిందపడిన వ్యక్తిపై కారు దూసుకెళ్లి మృతి
X

దిశ, నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ముందుగా స్కూటీ ఢీకొట్టగా, కిందపడిన అతడిపై అదే సమయంలో అటుగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాంపూర్ ఎక్స్‌రోడ్ వద్ద జరిగింది. రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండల కేంద్రానికి చెందిన బీమా పవర్ (38) తన కుమారుడు అరవింద్ పవర్‌తో కలిసి జిల్లెల్ల గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో రాంపూర్ ఎక్స్‌రోడ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, బద్దిపడగ వైపు నుంచి సిద్దిపేట దిశగా స్కూటీపై వస్తున్న నర్మేట సాయి వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో బద్దిపడగ వైపు నుంచి హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌కుమార్ నడుపుతున్న కారు వేగంగా వచ్చి బీమా పవర్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు కారు కింద చిక్కుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బీమా పవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు అరవింద్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మృతుడి భార్య మీనా పవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ తెలిపారు.

Next Story