- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేడే రోజున తీవ్ర విషాదం.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి
దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్లే.. గోవిందన్(45), సుబ్బరావు(45) అనే ఇద్దరు కార్మికులు తిరువళ్లూరులోని ఒక ప్రవేటు స్కూల్లో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయడానికి వెళ్లారు. కాగా శుభ్రం చేసేందుకు ట్యాంకు లోపలికి దిగగా.. విషవాయువులు పీల్చి, ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. రోప్ హార్నెస్, భద్రతా పరికరాలను ఉపయోగించి.. ఫైర్, రెస్క్యూ ఆఫీసర్స్ వీరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టానికి పొర్నేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఇద్దరి కార్మికులను మీంజూర్ పంచాయతీ అధికారులే పంపించారని పాఠశాల ప్రిన్సిపల్ సిమియోన్ విక్టర్ తెలిపారు. మే డే రోజున వీరిద్దరికీ పారిశుధ్య పనులు కేటాయించలేదని పంచాయతీ ఆఫీసర్లు స్కూలు వాదనలు కొట్టిపారేశారు. కాగా పోలీసులు ప్రిన్సిపల్ సిమియోన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.