నగరం నడిబొడ్డున విషాదం.. ఫ్లైఓవర్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-01 03:50:08  IST  )

ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగర పరిధిలోని అంబర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

నగరం నడిబొడ్డున విషాదం.. ఫ్లైఓవర్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగర పరిధిలోని అంబర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాచిగూడ (Kachiguda) నుంచి అంబర్‌పేట్‌ (Amberpet) వైపునకు ఫ్లైఓవర్ పైనుంచి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఛే నంబర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఫ్లైఓవర్ రైలింగ్‌ను ఢీకొట్టి కింద పడిపోయాడు. ఈ దుర్ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story