విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి

by Naga Rani Yarlagadda |

ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భీమడోలు (Bheemadolu)కు సమీపంలో ఉన్న చెరువులో ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు పడి మరణించారు.

విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భీమడోలు (Bheemadolu)కు సమీపంలో ఉన్న చెరువులో ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు పడి మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని, మృతదేహాల్ని పోస్టుమార్టంకు పంపి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. గల్లంతైన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story