- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, వనస్థలిపురం: హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్ను బైకు ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్కానిస్టేబుల్ స్పాట్లోనే మృతిచెందాడు. హయత్నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రమావత్మాన్ సింగ్ (43) గురువారం సాయంత్రం విధులు ముగించుకుని తొర్రూర్ లోని తన నివాసానికి బయలుదేరాడు.
ఔటర్రింగ్రోడ్డు సర్వీస్రోడ్డులో వస్తుండగా.. పెద్ద అంబర్పేట వద్దకు రాగానే ముందు వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ ఎలాంటి ఇండికేటర్లేకుండా నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్టిప్పర్వెనకాల బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై మాన్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు.
సంఘటనా స్థలంలో ఉన్నవారు డయల్100కు కాల్చేయడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగరాజు గౌడ్తెలిపారు. తెలిపారుసమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మాన్సింగ్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు.






