విష వాయువు లీక్.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-12 02:01:21  IST  )

విష వాయువు లీక్ అయి ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన అనకాపల్లి (Anakapally) జిల్లా పరవాడ ఫార్మా సిటీ (Parawada Pharma City)లో చోటుచేసుకుంది.

విష వాయువు లీక్.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: విష వాయువు లీక్ అయి ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన అనకాపల్లి (Anakapally) జిల్లా పరవాడ ఫార్మా సిటీ (Parawada Pharma City)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్ఎస్ ఫార్మా కంపెనీ (SS Pharma Company)లో బుధవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి విష వాయువు లీక్ అయింది. ఈ దుర్ఘటనలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్‌తో పాటు కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం షీలానగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచార ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Next Story