రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

by Disha Web Desk 1 |
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, కొల్చారం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలైన ఘటన కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మాసాని భీములు, ఎర్ర సుధాకర్ బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో పోతుంశెట్టిపల్లి రైతు వేదిక వద్దకు రాగానే బైక్ అదపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీములు, సుధాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిద్దరిని 108 అంబులెన్స్ లో మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed