ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

by Dishafeatures2 |
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఒరిస్సా రాష్ట్రంలోని కలహంది జిల్లాలో పోలీసుల ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మదన్ పూర్ -రాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తపెరెంగ-ల్యూబెన్ గడ్ అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు కలహంది ఎస్పీ అభిలాష్ జీ తెలిపారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలు కాగా అతడిని బొలంగీర్ లోని భీమా భోయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed