వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి

by Disha Web Desk 19 |
వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలంలోని తాటిపాముల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుంది. సోమవారం గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఓ బాలిక చెరువులో పడిపోయింది. దీంతో ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన మిగితా ఇద్దరు బాలికలు కూడా చెరువులో మునిగి చనిపోయారు. కాగా, మృతులను తిరుపతమ్మ (14), సంధ్య (12) , దీపిక (10) గా గుర్తించారు. చనిపోయిన ముగ్గురు బాలికలు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతి చెండటంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story