బాపట్లలో ఘోర లారీ ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు దుర్మరణం

by Disha Web Desk 2 |
బాపట్లలో ఘోర లారీ ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె మండలం రావి అనంతవరం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నాపరాళ్లతో మాచర్ల నుంచి రేపల్లె వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed