భర్తపై డీజిల్ పోసి నిప్పంటించిన భార్య

by Disha Web Desk 12 |
భర్తపై డీజిల్ పోసి నిప్పంటించిన భార్య
X

దిశ, గుమ్మడిదల : నిద్రిస్తున్న సమయంలో భర్త పై భార్య డీజిల్ పోసి నిప్పంటించిన ఘటన జిన్నారం మండలం ఊట్ల గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఊట్ల గ్రామానికి చెందిన సుంకు నర్సింలు నిద్రిస్తున్న సమయంలో భార్య సుంకు యాదమ్మ భర్త ఒంటిపై డీజిల్ పోసి నిప్పంటించింది. దీంతో వంటిపై తీవ్ర గాయాలైన భర్త నరసింహులని గమనించిన స్థానికులు హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరికి 10, 7, 3 సంవత్సరాల ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనకు దారి తీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story