బంగారు కమ్మలు అమ్మి మరీ.. భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?

by Disha Web Desk 9 |
బంగారు కమ్మలు అమ్మి మరీ.. భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చంపడం అంటే అందరికీ సినిమాల్లో చూసినంత సులభంగా అయిపోయింది. తాజాగా.. ఓ భార్య కట్టుకున్న భర్తనే కిరాతకంగా చంపించిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గోపాల్, పీరు బాయి అనే ఇద్దరు కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే గోపాల్ మద్యానికి బానిసై.. తన భార్యను రోజూ వేధించేవాడు. దీంతో విసిగిపోయిన పీరుబాయి, గోపాల్‌ను చంపించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె దగ్గరున్న బంగారు నగలను అమ్మి, సుపారీ గ్యాంగ్(చందర్, మహేష్) వారికి రూ. 2 లక్షలు ఇచ్చి వారి సహాయం కోరింది. వారు గోపాల్‌ను డొంకల్ అడవిలో దారుణంగా హత్య చేశారు. దర్యాప్తులో అతడి భార్యే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. ఆమెను, హంతకులిద్దర్ని అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Next Story

Most Viewed