దారుణం.. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని.. భార్యను?

by Jakkula Mamatha |
దారుణం.. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని.. భార్యను?
X

దిశ, వెబ్‌డెస్క్: తాగుడుకు బానిస అయిన ఓ భర్త కసాయిగా మారాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మాదన్నపల్లిలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారిన భర్త మునుస్వామి రోజు భార్య దగ్గర డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడు. ఇదే క్రమంలో ఓ రోజు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అందుకు మంగమ్మ నిరాకరించటంతో గొడవ పడి బయటకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి వచ్చిన భర్త ఆవేశానికి గురై భార్య మంగమ్మను ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Next Story