హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు..

by Disha Web Desk 13 |
హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు..
X

దిశ, మల్యాల: కొండగట్టులోని దిగువ ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ గుడిలోని హుండీని పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు. వివరాల్లోకి వెళితే.. గౌడ సంఘం అధ్యక్షుడు ఒల్లాల నవీన్ గౌడ్ యధావిధిగా బుధవారం రోజున రాత్రి 8 గంటలకు ఎల్లమ్మ గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళాడు. మళ్లీ గురువారం ఉదయం 6 గంటలకు తాళం తీద్దామని గుడి దగ్గరకు వెళ్లి చూసేసరికి గుడి తాళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. హుండీలో దాదాపుగా 2000 రూపాయల వరకు నగదు ఉన్నట్లు ఆలయంలో చొరబడిన నిందితులను పట్టుకొని శిక్షించాలని ఒల్లాల నవీన్ గౌడ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


కొండగట్టు చౌరస్తాకు అతి సమీపంలో ఉన్న బొద్దుల మోహన్ కోడిగుడ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు లాగే బుధవారం రోజున తన హ్యాపీ ట్రాలీ ఆటో టీఎస్ 23 టి 0961 నెంబర్ గల వాహనంలో కోడి గుడ్లతో సహా తన ఇంటి ముందర పెట్టి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. గురువారం రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నిద్ర లేచి చూసేసరికి తన ఆటో కనబడడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కొండగట్టు దిగువ ప్రాంతంలో జరిగిన ఈ రెండు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి తెలిపారు.

Next Story

Most Viewed