మీ అన్నను పొడిచి పారేశాం.. తమ్మునికి దుండగుల కాల్

by Disha Web Desk 20 |
మీ అన్నను పొడిచి  పారేశాం.. తమ్మునికి దుండగుల కాల్
X

దిశ, మర్పల్లి : కత్తులతో యువకుడి పైన దాడి చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మోమిన్ పేట ఎస్సై విజయ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం, మోమిన్ పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామపంచాయతీ వార్డు మెంబర్ గౌండ్ల లక్ష్మీదాస్ (27), బొంగులూరి ముళ్ళని శ్రీను ఇద్దరు సదశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు వారిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అటుగా వచ్చిన గోంగూళూరి ఆశి రెడ్డి అనే వ్యక్తి గౌండ్ల లక్ష్మీ దాస్, ముళ్ళని శ్రీను పైన దాడి చేశాడు. లక్ష్మీ దాస్ తమ్ముడు గౌండ్ల శ్రీకాంత్ గౌడ్ అడ్డుపడగా అతనిని కూడా ఆశిరెడ్డి, అతని మిత్రుడు ప్రసాద్ గౌడ్ దాడికి దిగి కొట్టారు. గ్రామస్తులు అడ్డు పడి, నచ్చజెప్పి ఇరువురిని చెదరగొట్టారు. సోమవారం ఉదయం ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ అన్న లక్ష్మీదాసును కత్తితో పొడిచి గ్రామ శివారులో పారవేశాం తీసుకుపోండి అని తెలిపాడు.

లక్ష్మి దాస్ కుటుంబీకులు అక్కడకు వెళ్ళి చూడగా రక్తపు మడుగులో లక్ష్మీ దాస్ కొట్టుమిట్టాడుతునట్లు తెలిపారు. వెంటనే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోమిన్ పేట ఎస్ఐ విజయ ప్రకాష్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై విజయ ప్రకాష్ అన్నారు.

Next Story

Most Viewed