అదుపు తప్పిన స్కూల్ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది..

by Disha Web Desk 11 |
అదుపు తప్పిన స్కూల్ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది..
X

దిశ, శామీర్ పేట: స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని గుంతలోకి దూసుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శామీర్ పేట మండల పరిధి మజీద్ పూర్ గ్రామంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు శామీర్ పేట్ నుంచి తూంకుంట వైపు విద్యార్థులను దింపడం నిమిత్తం బయలుదేరింది. ఈ క్రమంలో దొంగల మైసమ్మ టీ టైం వద్ద బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని గుంతలోకి దూసుకుపోయింది.


ఈ ప్రమాదంలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలవడంతో హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ కు లో బీపీ అవడంతో ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా డ్రైవర్ మద్యం మత్తులో ఉండి అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed