- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి కోనేరులో గల్లంతు..
by Disha Web Desk 11 |
X
దిశ, ఆమనగల్లు: దైవ దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి కోనేరులో గల్లంతయిన సంఘటన కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పుణ్యక్షేత్రమైన మైసిగండి దేవాలయానికి ప్రతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది భక్తులు విచ్చేసి మైసమ్మను దర్శించుకుంటారు. ఆదివారం హైదరాబాద్ శాలిబండలో నివాసం ఉంటున్నమారాఠకు చెందిన నైక్ సంజయ్ (38) భార్యా పిల్లలతో కలిసి మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు.
అనంతరం శివాలయం ఎదురుగా ఉన్న కోనేరులో రెడ్ ప్యాంటు, తెల్ల బనియన్ ధరించిన సంజయ్ కొలనులోకి దిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు ఆలయ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే ఆలయ సిబ్బంది పోలీసులు అక్కడకు చేరుకొని బలగాలను కోనేరులోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. కోనేరులో గల్లంతైన వ్యక్తి రాత్రి వరకైన దొరకకపోవడంతో రేపు మరిన్ని బలగాలతో గాలింపు చర్యలు చేపట్టనున్నారు.
Next Story