బైక్‌తో సహా నిప్పు పెట్టి వ్యక్తి దారుణ హత్య

by Disha Web Desk 12 |
బైక్‌తో సహా నిప్పు పెట్టి వ్యక్తి దారుణ హత్య
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఐడీఏ బొల్లారం ప్రాంతానికి చెందిన తారికేష్ బైక్ పై వెళుతుండగా దుండగులు వెంటాడి దారిలో అడ్డుకున్నారు. పెట్రోల్ చల్లి బైక్ తో సహా నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో తారికేష్ అక్కడికక్కడే మరణించాడు. బైక్ నెంబర్ ఆధారంగా హతున్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు?.. ఎందుకు? అన్నది తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed