బోయిన్ పల్లిలో యువతి అదృశ్యం

by Dishafeatures2 |
బోయిన్ పల్లిలో యువతి అదృశ్యం
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: తల్లి ప్రక్కన పడుకుని ఉన్న ఓ యువతి తెల్లవారి లేచి చూసే సరికి కనిపించకుండా పోయిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిన్ పల్లి ఆర్య సమాజ్ వద్ద నివాసం ఉంటున్న కవితకు నందిని (20) అనే కూతురు ఉంది. నందిని చదువు మానేసి గత కొంత కాలంగా కవాడిగూడలోని ఓ మాల్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో నందినికి సికింద్రాబాద్ రసూల్ పూర్ కు చెందిన సంజు ( 20) తో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో వీరిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటం గమనించిన తల్లి నందినిని మందలించింది. దీంతో కొన్ని రోజులు తల్లితో సంజుకు ఎలాంటి ఫోన్లు చేయకుండా సరిగ్గానే ఉన్న నందిని.. శనివారం తెల్లవారు జామున ఇంట్లో నుండి బయటకు వెళ్లి పోయింది. ఉదయం తల్లి లేచి చూసేసరికి కూతురు కనిపించలేదు. దీంతో మధ్యాహ్నం వరకు వేచి చూసిన తల్లి కవిత బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed