టీ వేడిగా లేదన్నందుకు.. అత్తను హతమార్చిన కోడలు

by Disha Web Desk 6 |
టీ వేడిగా లేదన్నందుకు.. అత్తను హతమార్చిన కోడలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆహార అలవాట్ల వల్లనో లేదా మరేదైనా కారణంతో కొంత మంది క్షణికావేశానికి గురవుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న గొడవలను పెద్దవిగా చూస్తూ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలే జమాజంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తమిళనాడులో టీ వేడిగా లేదన్నందుకు అత్తను, కోడలు రాడ్ కొట్టి చంపేసింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పుదుక్కొట్టైలో గనుకు అనే మహిళకు మలాలైలోని సైకిల్ షాపు యజమానితో వివాహం జరిగింది. దీంతో గనుకుకు మానసిక సమస్యల ఉన్నందున ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం గనుకు అత్త ఫళనీయమ్మాల్‌కు టీ ఇస్తుంది. అయితే గురువారం ఉదయం గనుకు అత్తకు టీ పెట్టి ఇచ్చింది. టీ వేడిగా లేకపోవడంతో.. ఫళనీయమ్మాల్ టీ చల్లారిపోయిందని కోడలికి చెప్పింది. దీంతో కోపోద్రిక్తురాలైన గనుకు అత్తతో వాగ్వాదానికి దిగింది. అది కాస్త పెరిగి పెద్దదై గనుకు ఐరన్ రాడ్డుతో అత్తను కొట్టి చంపేసింది. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు.

Next Story