నేడు ఉగ్రవాదుల తరలింపు

by Dishafeatures2 |
నేడు ఉగ్రవాదుల తరలింపు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హిజ్భుత్ తెహ్రీర్ ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురితోపాటు తాజాగా అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరిని ఏటీఎస్ అధికారులు శుక్రవారం భోపాల్ తరలించనున్నారు. కాగా విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల నేపథ్యంలో ఓ బృందం హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఇటీవల భోపాల్ ఏటీఎస్ పోలీసులు తెలంగాణ సీఐ సెల్ సిబ్బందితో కలిసి హిజ్భుత్ తెహ్రీర్ సంస్థకు చెందిన సలీంతోపాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని భోపాల్ తరలించారు.

ఆ తర్వాత కోర్టు అనుమతితో ఆరుగురిని కస్టడీకి తీసుకొని నాలుగు రోజుల క్రితం ఏటీఎస్ పోలీసులు తిరిగి హైదరాబాద్ వచ్చారు. వీరి నుంచి వెళ్లడైన వివరాల క్రమంలో పాతబస్తీలోని బాబానగర్ నుంచి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుల కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరితోపాటు బాబానగర్ నుంచి అరెస్ట్ చేసిన ఇద్దరిని భోపాల్ తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా పట్టుబడ్డ నిందితుల నుంచి ఏటీఎస్ పోలీసులు మరికొందరి ఉగ్రవాదుల సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఓ బృందం ఇక్కడే ఉండి వారి కోసం గాలింపు జరుపనున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed