తండ్రికి ఫిర్యాదు చేసిందన్న కోపంతో.. కూతురిపై దారుణం

by Disha Web Desk 7 |
తండ్రికి ఫిర్యాదు చేసిందన్న కోపంతో.. కూతురిపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: తనపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మైనర్ బాలిక తండ్రికి ఫిర్యాదు చేసింది. అదే ఆ బాలికకు పట్ల యమపాసమయ్యింది. ఆ యువకుడు బాలికను అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపి.. అనంతరం అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా జిందాల్ క్వార్టర్స్‌‌లో చోటుచేసుకుంది.

జిందాల్ అల్యూమినియం కంపెనీ ఉద్యోగి లక్ష్మణ్‌సింగ్, అతడి కుమార్తె ఖుషి(11).. జిందాల్ క్వార్టర్స్‌లోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. అదే అంతస్తులో మొదటి ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నాడు నిందుతుడు నందకిశోర్. కాగా, ఖుషి కిందకి వస్తోన్న ప్రతిసారి నందకిశోర్ తనతో అసభ్యంగా ప్రవర్తించే వాడు. దీంతో విసుగు చెందిన బాలిక తన తండ్రితో చెప్పింది. తండ్రి అసోసియేషన్ ముందు పంచాయితీ పెట్టి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నందకిశోర్ సోమవారం ఖుషిని టెర్రస్‌పైనే కత్తితో పొడిచి అనంతరం తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖుషి అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాలపాలైన నందకొశోర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు చేస్తున్నారు. కాగా, వీరందరూ జిందాల్ క్వార్టర్స్‌కు వలస వచ్చిన కార్మికులు కావడం గమనార్హం.

Next Story

Most Viewed