విజయ పాల కేంద్రంలో ట్యాంకర్ పేలి టెక్నీషియన్ మృతి

by Disha Web Desk |
విజయ పాల కేంద్రంలో ట్యాంకర్ పేలి టెక్నీషియన్ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అన్నమయ్య జిల్లా రాయచోటి వరిగ క్రాస్‌ వద్ద గల విజయ పాల కేంద్రంలో పాలు నిల్వ ఉంచే ట్యాంకర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం హర్యానాకు చెందిన టెక్నీషియన్‌ జోగేంద్ర సింగ్‌ (32) విజయ పాల కేంద్రంలోని ట్యాంకర్‌ను రిపేర్‌ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా అది పేలడంతో టెక్నీషియన్ జోగేంద్ర సింగ్‌ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.

మరోవైపు పక్కనే ఉన్న మరో టెక్నీషియన్ నాగరాజు (45)తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో క్షతగాత్రుడు నాగరాజుని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి వెంకటరామి రెడ్డి, సిబ్బంది జోగేంద్ర మృతదేహాన్ని ట్యాంకర్‌ నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed