టాటా ఏస్ ఢీ కొని యువ‌కుడు మృతి

by Ratna Kumari |

టాటా ఏస్ ఢీ కొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో శుక్రవారం చోటు చేసుకుంది.

టాటా ఏస్ ఢీ కొని యువ‌కుడు మృతి
X

దిశ, మంథని : టాటా ఏస్ ఢీ కొని యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిపురం నుంచి మంథని వైపు యువకుడు బైక్ పై వస్తున్నాడు. మంథని నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం యువకుని బైక్ ను ఢీ కొట్టింది. ఆ యువకుడి తలకు బలమైన దెబ్బలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిది మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామం రాయిని దేవేందర్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు మంథని పోలీసులు తెలిపారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story