ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి రూ.16 లక్షల బిల్లు

by Disha Web Desk 2 |
ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి రూ.16 లక్షల బిల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి హద్దుఅదుపు లేకుండా పోతోంది. అందినకాడికి దోచేస్తున్నారు. గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన జైకిషన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.16 లక్షల బిల్లు వేసి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం తీరుతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పేషెంట్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Next Story

Most Viewed