బ్రేకింగ్: రన్నింగ్‌లోనే ఊడిపోయిన డీజిల్ ట్యాంక్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: రన్నింగ్‌లోనే ఊడిపోయిన డీజిల్ ట్యాంక్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత విద్యార్థులు స్కూల్ బస్సులో ఇంటికి వెళ్తుండగా.. రన్నింగ్‌లోనే బస్సు డిజిల్ ట్యాంక్ లీకైంది. అలాగే దాదాపు 100 మీటర్లు వెళ్లిన తర్వాత రన్నింగ్‌లోనే బస్సు డీజిల్ ట్యాంక్ ఊడిపోయింది. గమనించిన వాహనదారులు అప్రమత్తం చేయడంతో డ్రైవర్ బస్సును నిలిపి విద్యార్థులను కిందకి దించారు.

డీజిల్ ట్యాంక్ నుండి ఎలాంటి మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed