యాసిడ్ తాగి విద్యార్థిని ఆత్మ హత్యాయత్నం

by Ratna Kumari |

నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ విద్యార్థిని సోమవారం బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

యాసిడ్ తాగి విద్యార్థిని ఆత్మ హత్యాయత్నం
X

దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ విద్యార్థిని సోమవారం బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అనుములు మండలంలోని హజారిగూడెం గ్రామానికి చెంది ఎర్రబోయిన హేమ శ్రీ (19) బీసీ హాస్టల్లో ఉంటూ ఎన్జీ కాలేజీలో డిగ్రీ సెంకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం బాత్రూంలో వాడే యాసిడ్ తాగింది. తోటి విద్యార్థినులు గమనించి, హాస్టల్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన తర్వాత, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమ శ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అనారోగ్య సమస్యలతోనే విద్యార్థిని ఈ ఘటనకు పాల్పడిందని అనుకుంటున్నా.. పోలీసులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి, బీసీ సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు.

Next Story