శ్రీ చైతన్య విద్యార్థి ఉరి వేసుకుని మృతి

by velandi.Saikiran |

శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నితీష్ అప్పం (16) మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు.

శ్రీ చైతన్య విద్యార్థి ఉరి వేసుకుని మృతి
X

పదో తరగతి పరీక్షల వేళ విషాదం

శ్రీ చైతన్య విద్యార్థి ఉరి వేసుకుని మృతి

దిశ, లక్ష్మిదేవిపల్లి : పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో కొత్తగూడెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నితీష్ అప్పం (16) మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అశోక్‌నగర్ మామిడి తోట ప్రాంతానికి చెందిన నితీష్ తల్లి మౌనిక టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు సమాచారం. ఈ కుటుంబం టేకులపల్లి మండలం కోయగూడెం ప్రాంతానికి చెందినదిగా తెలిసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయుల వైఖరి కారణంగా బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని తెలిపారు. ఈ కారణాలతో మనస్థాపానికి గురైన నితీష్ ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు, ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story