తండ్రి చనిపోయాడని మనస్థాపానికి గురై కొడుకు ఆత్మహత్య...

by Disha Web Desk 20 |
తండ్రి చనిపోయాడని మనస్థాపానికి గురై కొడుకు ఆత్మహత్య...
X

దిశ, మఠంపల్లి : తండ్రి మరణాన్ని విన్న కొడుకు మనస్థాపానికి గురై మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి కృష్ణానదిలో శవమై తేలాడు. శనివారం రోజునా మధ్యాహ్నం సమయంలో, స్థానిక గ్రామస్తుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో మృతుడి ఫోటో షేర్ చేయగా బాధిత కుటుంబ సభ్యులు ఫోటో, చూసి మఠంపల్లి పోలీస్ స్టేషన్లో తన తమ్ముడు వెంకట శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్సై బాలకృష్ణ వివరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్ల టౌనుకు చెందిన మాశెట్టి సుబ్రహ్మణ్యం (31) తండ్రి సుబ్బారావు తను మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు.

సుమారు 8 నెలల క్రితం అతని తండ్రి సుబ్బారావు గైదా దేవాలయం వద్ద కృష్ణనదిలో ప్రమాదవశాత్తు పడి చనిపోగా ఆ మరణాన్ని విన్న కొడుకు సుబ్రహ్మణ్యం మానసికంగా గురై అప్పటినుండి మానసిక స్థితి బాగోలేక తన చికిత్స కొరకు విజయవాడలోని కృష్ణ న్యూరో సెంటర్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడని అయినప్పటికీ తను మానసిక స్థితి మెరుగు బాగోలేక ఒంటరిగా ఉంటూ పదేపదే తన తండ్రి లేడని ఆలోచనను ఆలోచిస్తూ ఉండే వాడని గత 23 రోజు క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడని అతని తమ్ముడు వెంకట శ్రీనివాసరావు స్థానిక మఠంపల్లి ఎస్సై బాలకృష్ణకు వివరించారు. ఈరోజు ఉదయం కృష్ణా నదిలో గుర్తు తెలియని శవం ఫోటోలను సోషల్ మీడియాలో చూసి శవాన్ని గుర్తుపట్టి మట్టపల్లి వచ్చి మా శెట్టి సుబ్రహ్మణ్యంగా అతని బంధువులు గుర్తించినారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వలన ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి చనిపోయినట్లు అతని తమ్ముడు అయినా మా శెట్టి వెంకట శ్రీనివాసరావు ఫిర్యాదు ఇవ్వగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Next Story