Bus Accident: చౌటుప్పల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. డ్రైవర్ స్పాట్ డెడ్

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-09 11:53:41  IST  )

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది.

Bus Accident: చౌటుప్పల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. డ్రైవర్ స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఆగివున్న లారీని అతివేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు(RTC Bus) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మరో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story