దేవరకద్రలో చోరీ.. బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు..

by Taduka Kalyani |

కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, నగదును దోచుకెళ్లిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం జరిగింది.

దేవరకద్రలో చోరీ.. బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు..
X

దిశ, దేవరకద్ర: కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, నగదును దోచుకెళ్లిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర పట్టణానికి చెందిన కోస్కే భగవంతు తన కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లాడు.

ఇది గమనించిన దుండగులు ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి నాలుగు తులాల బంగారం, వెండి ఆభరణాలు, కొంత నగదును దోచుకెళ్లినట్లు భగవంతు దేవరకద్ర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

Next Story