లారీని ఢీ కొట్టిన ఆటో..

by Disha Web Desk 20 |
లారీని ఢీ కొట్టిన ఆటో..
X

దిశ, పెనుబల్లి : ఖమ్మం, రాజమండ్రి జాతీయ రహదారి పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చండ్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన ధరావత్ శేఖర్ తన ఆటోతో సత్తుపల్లి వెళుతూ ఉండగా రామచంద్రరావు బంజర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

శేఖర్ మద్యం సేవించి ఆటో నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. శేఖర్ తలకు బలమైన గాయం కావడంతో పెనుబల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు. ఈసంఘటన పై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed