కారు, ఆటో ఢీ.. ఆటో డ్రైవర్ మృతి..

by Disha Web Desk 20 |
కారు, ఆటో ఢీ.. ఆటో డ్రైవర్ మృతి..
X

దిశ, మాచారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఆటోట్రైవర్ మృతి చెందిన సంఘటన పాల్వంచ మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట్ - దోమకొండ అప్రోచ్ రోడ్డులో కారు, ఆటో ఢీకొని ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒడ్డె రాజు అనే వ్యక్తి వ్యవసాయం పనినిమిత్తం ఆటోలో అతని సోదరిని విడిచిపెట్టి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దోమకొండ మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు చెందిన కారుగా గుర్తించారు. మృతుడు లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

Next Story

Most Viewed