ఘోర ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి..

by Disha Web Desk 9 |
ఘోర ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాంలోని గువహతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్‌బారీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని గువహతిలో జలక్​బారీ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్‌ వ్యాన్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారంతా అస్సాం ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపారా లేక నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed