తాను చనిపోతూ ఏడుగురికి పునర్జన్మ..

by Disha Web Desk 11 |
తాను చనిపోతూ ఏడుగురికి పునర్జన్మ..
X

దిశ, మక్తల్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తలకు తీవ్ర గాయమై బ్రెయిన్ డెడ్ అవడంతో ఆమె అవయవాలను దానం చేయడంతో ఏడుగురికి పునర్జన్మ దక్కింది. వివరాల్లోకి వెళ్లితే.. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రానికి చెందిన శేషగిరి, భార్య వీణా(40)తో మూడు రోజుల క్రితం బైక్ పై మక్తల్ కు వెళ్తుండగా నల్ల గట్టు మారెమ్మ వద్ద ఎదురుగా వస్తున్నా వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ పై వెనుక కూర్చున్న వీణా కింద పడింది. దీంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో రాయచూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా సోమవారం చికిత్స పొందుతూ వీణ బ్రెన్ డెడ్ తో మృతి చెందింది. ఇది ఇలా ఉండగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఏడుగురికి వీణ అవయవాలను దానం చేయడంతో వారికి కొత్త జీవితం వస్తుందని డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు కోరడంతో అందుకు భర్త శేషగిరి ఒప్పుకున్నాడు. ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని డాక్టర్లు, పలు స్వచ్ఛంద సంస్థలు కొనియాడారు.


Next Story

Most Viewed