రేగోడ్ వార్డు మెంబర్ మచ్కురి సుజాత మృతి

by Taduka Kalyani |

మండల కేంద్రమైన రేగోడ్ లోని మూడవ వార్డు మెంబర్ మచ్కురి సుజాత అనారోగ్యంతో గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందింది.

రేగోడ్ వార్డు మెంబర్ మచ్కురి సుజాత మృతి
X

దిశ,రేగోడ్: మండల కేంద్రమైన రేగోడ్ లోని మూడవ వార్డు మెంబర్ మచ్కురి సుజాత అనారోగ్యంతో గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె అందరితో కలుపుగోలుగా ఉండడడంతో పాటు వారి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి సుజాత మృతి తీరని లోటని నాయకులు విచారం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ ఫర్వీన్ సుల్తానాచోటు, ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్ గుప్త, వార్డు సభ్యులు, నాయకులు సుజాత ఆంత్యక్రియల్లో పాల్గొని కుటుంబీకులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story