గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి

by Taduka Kalyani |

చర్లపల్లి కేంద్ర కారాగారానికి చెందిన ఓ ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి
X

దిశ, సికింద్రాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారానికి చెందిన ఓ ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న అడెల్లు గుండె సంబంధిత సమస్యలతో గాంధీ ఆస్పత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో కార్డియోజెనిక్ షాక్‌కు గురై అడెల్లు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియను నిబంధనల ప్రకారం వీడియో చిత్రీకరణ మధ్య నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Next Story