ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Disha Web Desk 2 |
ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు కారును బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి కర్నూలు వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story