ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. వెంటాడి పట్టుకున్న పోలీసులు

by Dishafeatures2 |
ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. వెంటాడి పట్టుకున్న పోలీసులు
X

దిశ, కొత్తవలస: గంజాయి అక్రమ రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. కొత్తవలస సీఐ బాల సూర్యరావు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు తుమ్మకాపల్లి పంచాయతీలోని ఫ్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద గట్టినిఘా ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ ఉండగా మంగళవారం అరకు నుండి విశాఖపట్నం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో నార్త్ ఢిల్లీకి చెందిన ఓ మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు 10 కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తూ పోలీసులు కంటపడ్డారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారని తెలుసుకొని తప్పించుకునే ప్రయత్నం చేశారు. విషయాన్ని పసిగట్టిన చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వారిపై దాడి చేసి 10 కేజీల గంజాయితోపాటు ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ బాల సూర్యరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నిందితులు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story