- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి..
by Batti.Sumithra |
లారీని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి దుర్మరణం చెందగా మరొకరు గాయాలపాలయ్యారు.

X
దిశ, భీమదేవరపల్లి (ఎల్కతుర్తి) : లారీని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి దుర్మరణం చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఎల్కతుర్తి మండల పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన మంద ప్రణయ్ (20) స్నేహితులతో కలిసి బైక్ పై హన్మకొండకు వెళ్లి పరీక్షలు రాసి తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల సమీపంలో లారీని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా బస్సు రావడంతో లారీ టైర్ల కింద పడి మృత్యువాత పడ్డాడు. బైక్ పై వెనకాల కూర్చున్న మరో విద్యార్థికి గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రణయ్ వల్బాపూర్ లోని ఎస్ఆర్ఆర్ ఫార్మసీ కళాశాలలో చదువుతున్నాడు.
Next Story






