- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మైనర్పై అత్యాచారం.. పాస్టర్ అరెస్ట్
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు 42 అనే పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు 42 అనే పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబాబు కళ్లచెరువు గ్రామంలో ఓ చర్చిని నిర్వహిస్తుండగా కూలిపనులు చేసుకుని బతికే బాలిక 14 కుటుంబం గత కొంతకాలంగా ఆ చర్చికి వెళుతోంది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన పాస్టర్ ఆమెను చెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా పాస్టర్ బాలికపై దారుణానికి పాల్పడుతుండగా విషయం బయట చెప్పొద్దని బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉంది.
ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవడంతో పాస్టర్ అధిక మోతాదులో గర్భ నిరోధక మాత్రలను ఇచ్చాడు. తీవ్రరక్తస్రావం అవ్వడంతో బాధితురాలు తల్లికి విషయం చెప్పింది. పరిస్థితి విషమంగా ఉండటంతో బాలికను ఏలూరులోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోగా తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. నింధితుడిపై పోక్సో కేసు నమెదు చేయగా అతడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.






