ప్రేమతో ఒక్కటై... చావులోనూ ఏకమై..

by Disha Web Desk 1 |
ప్రేమతో ఒక్కటై... చావులోనూ ఏకమై..
X

పారాణి ఆరకుండానే.. దంపతుల బలవన్మరణం

పిట్లం మండలం బొల్లకపల్లిలో దారుణం

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నెలరోజుల క్రితమే పెళ్లి చేసుకుని.. ఆర్థిక ఇబ్బందులతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన పిట్లం మండలం బొల్లకపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దాల్ మాల్ గుట్టకు చెందిన ఉప్పరి కవిత, పిట్లం మండలం బొల్లకపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి సంతోష్ ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం ఇద్దరూ తమ కుటుంబాలను ఎదిరించి ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకుని బొల్లకపల్లిలో కాపురం పెట్టారు.

రోజులు గడుస్తున్నా్ కొద్ది.. వారి చేతిలో ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోయాయి. దీంతో ఏం పని చేయాలో తెలియక.. బయటకు వెళ్లేందకు చేతిలో చిల్లిగవ్వలేక ఆర్థికంగా తీవ్ర ఒత్తికి ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి కలిగి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి నైలాన్ త్రాడుతో నవ దంపతులు సంతోష్, కవితలు కలిసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed