రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి స్వల్ప గాయాలు..

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి స్వల్ప గాయాలు..
X

దిశ, ములుగు : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలైన ఘటన గురువారం ములుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రంగ క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన బాబుగౌడ్‌, అతని భార్య సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లో ప్రయివేట్‌ జాబ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా బెజ్జంకి గ్రామంలో బందువుల ఇంటి వద్ద జరిగిన ఎల్లమ్మ పండుగకు మంగళవారం బాబుగౌడ్‌, అతని భార్య, అన్నబిడ్డతో కలిసి వెళ్ళి గురువారం సికింద్రాబాద్ కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు.

సరిగ్గా ములుగు వద్దగల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రాగానే రాజీవ్‌ రహదారి పై ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఆదే క్రమంలో వెనకాల నుండి అతివేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఎర్టీగాను వెనక నుండి ఢీ కొట్టగానే బాబుగౌడ్‌ భార్య సుజాత ఛాతి పై నుండి వెళ్ళింది. దీంతో సుజాత (38) అక్కడిక్కడే మృతిచెందగా బాబు గౌడ్ కు, అన్న బిడ్డ స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానకు పంపించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యప్తు చేస్తున్నటు ఎస్సై రంగకృష్ణ తెలిపారు.

Next Story

Most Viewed